ఏడుపాయ వనదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి దేవి అలంకరణ
మెదక్ జిల్లాలోని ఏడుపాయ వనదుర్గా భవాని మాత ఆలయంలో ఆషాడ మాసం మొదటి ఆదివారం శాకాంబరి దేవి అలంకరణ జరిగింది. ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారికి క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, పచ్చిమిర్చి, గోబీ పువ్వు వంటి కూరగాయలతో వస్త్రాభరణాలుగా మలచి అలంకరించారు.
తెల్లవారు జామున నాలుగు గంటలకు అర్చకులు మంజీరా నది జలాలు, పంచామృతాలతో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శాకాంబరి రూపంలో అలంకరణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలు కట్టారు. ఆలయం భక్తులతో నిండిపోయింది. ఆలయ ఈఓ వీరేసం మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఆషాడ మాసంలో శాకాంబరి రూపంలో వనదుర్గమ్మను దర్శిస్తే సీజనల్ వ్యాధులు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com