కూకట్పల్లిలో KS బేకర్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనికీ; పరిశుభ్రత ఉల్లంఘనలు బయటపడ్డాయి
హైదరాబాద్లోని కూకట్పల్లిలో KS బేకర్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనికీ నిర్వహించారు. ఈ తనికీలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘనలు, పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి.
అధికారులు ఫ్రీజర్లో వెజ్, నాన్వెజ్ పదార్థాలను కలిపి నిల్వ చేసిన విషయాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగదిలో బొద్దింకలు, తుప్పు పట్టిన ఓవెన్లు, అపరిశుభ్రమైన టైల్స్ను కూడా గుర్తించారు.
ఈ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com