పేదల ఇళ్లు కూల్చడం లేదు, తప్పుడు ప్రచారం నమ్మవద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
సోమాజిగూడలోని హుసేన్ సాగర్ పరిసరాల్లో నివసించే పేదలు శుక్రవారం హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
తమ ఇళ్లకు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తారన్న సమాచారంతో వారు నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఆందోళన విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు.
బస్తీవాసులకు భరోసా ఇస్తూ, హైడ్రా పేదల ఇళ్లను ముట్టదని, ఇది నోటీసు కాదు, తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. కొంతమంది భూకబ్జాదార్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారిని కోరుతున్నట్లు రంగనాథ్ తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com