రాజస్థాన్లో మైనర్ బాలికపై అత్యాచారం: 4 హోటళ్ల కూల్చివేత, 14 మంది అరెస్ట్
రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో 13 ఏళ్ల బాలికను హోటల్కు విక్రయించి, 30 మందికి పైగా వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 23న పోలీసులు ఆ బాలికను ఒక హోటల్ నుంచి రక్షించారు. ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేయగా, మిగిలిన 18-20 మంది కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజులు నగరం బంద్కు దిగడంతో పాటు దోషులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో భజన్ లాల్ శర్మ ప్రభుత్వం నిన్న సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి వరకు బుల్డోజర్లతో నాలుగు హోటళ్లను కూల్చివేసింది. హోటల్ జాయ్, హోటల్ డ్రీమ్, హోటల్ సఫైర్ లాంటి చిన్న హోటళ్లే ఇలా ధ్వంసం చేశారు. అక్రమ నిర్మాణాల కారణంగానే వీటిని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
కేసు వివరాల ప్రకారం, ఒక ఆటో డ్రైవర్ ఆ బాలికను తొలుత హోటల్కు విక్రయించాడు. ఆ తర్వాత నాలుగు వేర్వేరు హోటళ్లలో ఉంచి, వరుసగా 30 మందికి పైగా వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి ఆమెను కాపాడారు. ప్రస్తుతం బాలిక సురక్షితంగా ఉంది. నిందితుల్లో పలువురు సరిహద్దు ప్రాంతాలకు పారిపోయినట్లు సమాచారం. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com