తిరుపతి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు.
అనంతరం తోమాల సేవ, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com