సింగరేణి బొగ్గు మాయం ఆరోపణలను తోసిపుచ్చిన GM రాధాకృష్ణ
మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ బొగ్గు మాయమైన ఆరోపణలను అవాస్తవమని తోసిపుచ్చారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన విలేకరులకు చెప్పారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బొగ్గు రవాణా వివరాలను GM వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తి నుంచి రవాణా వరకు పగట్బందీగా సాంకేతిక నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.
అత్యాధునిక సాంకేతికత వాడుతున్నామని, ప్రతి టన్ను, కేజీతోపాటు చిన్న బొగ్గు ముక్క కూడా లెక్క ఉండే వ్యవస్థ (SAP system) అమల్లో ఉందని GM వివరించారు. ఈ వ్యవస్థలో ఏ మోసం చేయడానికి ఆస్కారం లేదని, బొగ్గు మాయమైన పుకార్లలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com