తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోయస్ గార్డెన్కు షిఫ్ట్: రూ.350 కోట్ల ఒప్పందం?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తన నివాసాన్ని నీలంకరి నుంచి పోయస్ గార్డెన్కు మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీని కోసం రూ.350 కోట్ల ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. జయలలిత మేనకోడలు దీపతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం.
ప్రస్తుతం స్టాలిన్ సెక్రటేరియట్కు దూరంగా నీలంకరిలో నివసిస్తున్నారు. ఆయన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ను ఆపాల్సి వస్తోంది. ఇది జనానికి ఇబ్బందిగా మారడంతో, సచివాలయానికి దగ్గరగా నగరంలో షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నారు. ముందు మంత్రుల క్వార్టర్స్ను పరిశీలించినప్పటికీ, చివరికి పోయస్ గార్డెన్పై మనసు పడ్డారని తెలుస్తోంది.
పోయస్ గార్డెన్కు దగ్గర్లో నటుడు రజినీకాంత్ నివాసం ఉంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆమె కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపిన సందర్భంలో రజినీకాంత్ కారు దిగి సిగరెట్ తాగి అభిమానులను ఆకట్టుకున్న సంఘటనను సోషల్ మీడియాలో గుర్తుచేస్తున్నారు. స్టాలిన్ కూడా ఇక్కడికి మారితే మళ్ళీ అలాంటి సన్నివేశాలు రిపీట్ అవుతాయేమోనని చర్చ జరుగుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com