హైదరాబాద్ 30°C
అమరావతి 34°C
IST 12:30 PM
బుధవారం జూలై 8 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
నేరాలు

థానే: ఐసియు బెడ్ లేదని ఆసుపత్రి సిబ్బందిపై శివసేన నేత దాడి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
థానే: ఐసియు బెడ్ లేదని ఆసుపత్రి సిబ్బందిపై శివసేన నేత దాడి
📷 Click Jeth / Pexels
షేర్ కాపీ అయింది ✓

మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబీవలిలో శివసేన (షిండే వర్గం) కార్పొరేటర్ రమేష్ మాత్రే ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు.

పిల్లల ఐసియు బెడ్లు ఖాళీగా లేవనే కారణంతో రమేష్ మాత్రే తన అనుచరులతో కలిసి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ మహిళా గైనకాలజిస్ట్, మరో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు గాయపడ్డారు.

చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీపా శుక్లతో సహా సిబ్బందిని కార్పొరేటర్ వెనక నుంచి కొడుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై స్పందించిన కేడీఎం‌సీ కమిషనర్, విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేసినందుకు రమేష్ మాత్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.

దాడిని నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఉద్యోగులు విధులకు దూరంగా ఉండి ఆందోళన చేపట్టారు. దోషులపై కఠిన చర్యలు, వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రమేష్ మాత్రే స్పందన తెలియాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com