ఉప్పల్ బాలుపై వికారాబాద్లో కేసు నమోదు
వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో థార్ జీప్పై ప్రమాదకర విన్యాసాలు చేసిన ఉప్పల్ బాలుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉప్పల్ బాలు, అతని అనుచరులు కలిసి థార్ జీప్ పైకప్పుపై కూర్చొని, వాహనంపై స్టంట్స్ చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్గా మారాయి.
అనంతగిరిలో ఉన్న పద్మనాభస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఆలయానికి సమీపంలోనే ఈ ప్రమాదకర స్టంట్స్ చేయడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. కొండల్లో ఇలాంటి విన్యాసాలు చేస్తుంటే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ”నారోడు నా ఇష్టం అంటే కుదరదు“ అంటూ పోలీసులు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ప్రమాదకర స్టంట్స్ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com