విక్రమ్-1 రాకెట్ పరీక్ష: నేడు శ్రీహరికోట నుంచి ప్రయోగం
స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ తయారుచేసిన పూర్తి స్వదేశీ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ప్రయోగాత్మక పరీక్షకు సిద్ధమైంది. ఇది భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ప్రయోగం.
మిషన్ ‘ఆగమన’ పేరుతో జరుగుతున్న ఈ ప్రయోగంలో ప్రత్యేక పేలోడ్ బాక్స్లో చేతిరాత పోస్ట్కార్డులు, సూక్ష్మ కళాఖండాలు తీసుకువెళుతున్నారు. ప్రధాని మోదీ రాసిన ‘వందేమాతరం’ అనే పోస్ట్కార్డు, ఇస్రో మాజీ చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, శాస్త్రవేత్తలు రాసిన డజన్ల కొద్దీ పోస్ట్కార్డులు పేలోడ్లో ఉన్నాయి. అంతరిక్ష రంగంలో కృషి చేసిన మహానీయులను గౌరవించడమే లక్ష్యంగా స్కై రూట్ తెలిపింది.
కళాకారుడు అజయ్ కుమార్ మట్టేవాడ రూపొందించిన 18 క్యారెట్ల బంగారు చిన్న రాకెట్ ప్రతిరూపం కూడా ఈ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్తుంది. బియ్యం గింజ కంటే చిన్న ఈ బంగారు రాకెట్పై సర్ సివి రామన్, విక్రమ్ సారాబాయై, ఏపిజే అబ్దుల్ కలాం సూక్ష్మ చిత్రాలు చెక్కారు. వీటితో పాటు కాస్మోస్ డైమండ్ సంస్థ ‘కాస్మిక్ బ్లూమ్’ అనే ఆర్ట్వర్క్ను కూడా పంపుతున్నారు.
భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో ఇదొక కీలక ముందడుగు. ఈ ప్రయోగం విజయవంతమైతే స్కై రూట్ ఏరోస్పేస్ భవిష్యత్తులో ఉపగ్రహాల ప్రయోగ సేవలు అందించడానికి మార్గం సుగమం అవుతుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com