మేడ్చల్ లో గృహప్రవేశం చేస్తున్న కుటుంబంపై 50 మంది దుండగుల దాడి
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో ఒక కుటుంబం గృహప్రవేశం చేసుకుంటుండగా 40 నుంచి 50 మంది దుండగులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులపై కూడా దాడి చేసి గాయపరిచారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ఘటనతో ఇంటి వద్ద భయాందోళనలు నెలకొన్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com