బోన్ క్యాన్సర్ అవగాహన కోసం హైదరాబాద్లో డాక్టర్ గురువా రెడ్డి వాకతాన్
ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురువా రెడ్డి బోన్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ లో నిర్వహించిన వాకతాన్ లో పాల్గొన్నారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో బోన్ క్యాన్సర్ వస్తే అంగహీనత చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు రేడియో థెరపీ, కీమోథెరపీ, సర్జికల్ థెరపీ వంటి ఆధునిక చికిత్సలతో కాలు తొలగించాల్సిన అవసరం చాలా తగ్గిందని వివరించారు.
శరీరంలో ఏదైనా వాపు గానీ, గాయం గానీ నెల రోజుల్లో తగ్గకపోతే వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. ప్రతి వాపు క్యాన్సర్ కాదని, కేవలం 5% మాత్రమే బోన్ క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుందని చెప్పారు. ముందస్తు పరీక్షలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలకు బోన్ క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు తొలగించాలని, ప్రెస్ ద్వారా ఎక్కువగా ప్రచారం చేయాలని డాక్టర్ గురువా రెడ్డి విజ్ఞప్తి చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com