ఎస్ఐఆర్ నిర్లక్ష్యంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ హెచ్చరిక
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువు నేపథ్యంలో పార్టీ నేతల పనితీరుపై సమీక్ష ప్రారంభించారు. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో జూమ్ ద్వారా తొలిరోజు సమావేశమయ్యారు.
క్షేత్ర స్థాయి వివరాలతో పాటు, పార్టీ కార్యక్రమాల అమలు, పూర్తయిన పనులు, మిగిలిన పనులపై నాయకులను నిలదీశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అలసత్వం వహించిన నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతలు నిర్లక్ష్యం చేస్తే పార్టీ పదవుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
మంగళవారం జహీరాబాద్, మెదక్, మల్కాజగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలపై సమీక్ష కొనసాగనుంది. బుధవారం హైదరాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్; గురువారం నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతుంది.
నాలుగు రోజుల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పార్టీ పరిస్థితిపై పూర్తి అంచనాకు రావాలని మీనాక్షి నటరాజన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సంస్థాగత బలోపేతం, నేతల సమన్వయం, భవిష్యత్ రాజకీయ కార్యచరణపై కూడా ఈ సమీక్షల్లో చర్చించనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com