నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలు విడుదల; ఆల్ ఇండియా టాపర్లుగా ఆర్యన్ గుప్త, పన్సుల్ బన్సల్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ యూజీ 2026 పునఃప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో 11.21 లక్షల మంది వైద్య, దంత వైద్య, ఆయుష్, ఇతర అనుబంధ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు.
పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్త, హర్యాణకు చెందిన పన్సుల్ బన్సల్ ఇద్దరూ 715 మార్కులతో ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచారు. తెలంగాణలోని హనుమకొండకు చెందిన వీరయ్య గారి సహ్యు 705 మార్కులతో 13వ ర్యాంకు సాధించాడు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంకుతో ఏపీ టాపర్గా నిలిచింది.
మొత్తంగా 19 మంది 700 పైగా మార్కులు, 138 మంది 690 పైగా మార్కులు సాధించారు.
ఈ ఏడాది మేలో జరిగిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ వల్ల ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. ఆ తర్వాత గత నెల 21న పునఃపరీక్ష నిర్వహించింది. నిన్న సాయంత్రం తుది సమాధానం కీ విడుదల చేసిన ఎన్టీఏ, కొద్ది గంటల్లోనే ఫలితాలు ప్రకటించింది.
ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, రాష్ట్ర స్థాయి కోటా సీట్ల కోసం సంబంధిత రాష్ట్రాల సంస్థలు కౌన్సిలింగ్ నిర్వహిస్తాయని ఎన్టీఏ పేర్కొంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com