డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల సర్జరీ కోసం నేడు ముంబై వెళ్లనున్నారు
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు భుజాల శస్త్ర చికిత్స కోసం ముంబై వెళ్తున్నారు. రొటేటర్ కఫ్ గాయంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన, భుజాల కండరాలు దెబ్బతినడంతో అసౌకర్యంగా ఉన్నారు.
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సాయంత్రం సర్జరీ చేయించుకోనున్నారు. గతంలో ముంబై పర్యటనలో అధికారిక కార్యక్రమాల అనంతరం అదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా, రొటేటర్ కఫ్ తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు.
ఇప్పటికే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాల వల్ల ఆయన కొంత విరామం తీసుకున్నారు. ఇప్పుడు చికిత్స పూర్తి చేసుకునేందుకు ముంబై వెళ్తున్నారు. సర్జరీ తర్వాత వైద్యులు కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి సూచించే అవకాశం ఉంది. దీంతో ఆయన అధికారిక కార్యక్రమాలకు కొద్ది రోజుల పాటు తాత్కాలిక విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com