ఆధ్యాత్మికం

పూరి జగన్నాథ రథయాత్ర ఏర్పాట్లు: జూన్ 29న దేవస్నానోత్సవం, జూలై 16న రథయాత్ర

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పూరి జగన్నాథ రథయాత్ర ఏర్పాట్లు: జూన్ 29న దేవస్నానోత్సవం, జూలై 16న రథయాత్ర
📷 Government of Odisha / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. విశ్వ ప్రసిద్ధి చెందిన ఈ రథోత్సవం జూలై 16న నిర్వహించనున్నారు.

రథయాత్రకు ముందుగా అనేక సంప్రదాయ కార్యక్రమాలు ఉండగా, అందులో ముఖ్యమైన దేవస్నానోత్సవం ఈ నెల 29న జరగనుంది. జేష్ఠ పౌర్ణమి సందర్భంగా శ్రీక్షేత్రంలోని గర్భగుడి నుండి చతుర్థ మూర్తులను (బలభద్ర, సుభద్ర, సుదర్శన, జగన్నాథుడు) స్నాన మండపంపైకి తీసుకువస్తారు. 108 కలశాల పవిత్ర జలాలతో వారికి అభిషేకం చేస్తారు.

దేవస్నానం తర్వాత శ్రీ జగన్నాథుడు గజానన అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవం తెల్లవారుజామున 4:30 గంటలకు మంగళ హారతితో ప్రారంభమై, మరుసటి రోజు రాత్రి 2:30 గంటలకు గోప్య సేవలతో ముగుస్తుంది. దేవస్నానోత్సవాన్ని తిలకించేందుకు లక్షల మంది భక్తులు పూరీ చేరుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ట్రస్ట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com