తెలంగాణ TET ఫలితాలు నేడు విడుదల: అర్హత మార్కులు, DSC వెయిటేజీ వివరాలు
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే TET ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదల కానున్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ విద్యాశాఖ TET ఫలితాలను అధికారికంగా ప్రకటించనుంది. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా మార్కులు చూసుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,15,28 మంది అభ్యర్థులు TET పరీక్షకు హాజరయ్యారు. కేటగరీల వారీగా అర్హత మార్కుల కటాఫ్లను ప్రభుత్వం ముందే ప్రకటించింది. OC అభ్యర్థులు కనీసం 60% మార్కులు అంటే 150 మార్కులకు గాను 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. BC అభ్యర్థులు కనీసం 50% మార్కులు అంటే 75 మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు. SC, ST మరియు దివ్యాంగ అభ్యర్థులు కనీసం 40% మార్కులు అంటే 60 మార్కులు సాధిస్తే సరిపోతుంది.
హాల్ టికెట్ నంబర్ నమోదు చేసిన వెంటనే అభ్యర్థులకు ఫలితాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ వెబ్సైట్ల ద్వారా మరియు మొబైల్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
TET లో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ నియమకాల్లో అంటే DSC లో 20% వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఇందులో మంచి స్కోర్ సాధించడం అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను మరింత మెరుగుపరుస్తుంది.
TET ఫలితాల తర్వాత DSC నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శాఖల వారీగా ఖాళీలను గుర్తించే పని మొదలుపెట్టింది. ఆర్థిక శాఖ కూడా ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయ నియమకాలు చేపట్టాల్సి ఉంది. విద్యాశాఖ కూడా DSC నోటిఫికేషన్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com