పార్లమెంట్ సమావేశాల అంశాలపై ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజాభవన్లో ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com