రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్లు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్లను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రిపోర్ట్ల విడుదలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గతంలో ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతిభద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. వీటికి తోడు మరో రెండు కీలకాంశాలపై కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు.
అంతేకాకుండా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గవర్నెన్స్ సంస్కరణలపై కొత్తగా రూపొందించిన పాలసీలు, సంస్కరణలతో కూడిన గుడ్ గవర్నెన్స్, వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్లను విడుదల చేయనున్నారు. మొత్తం 10 రిపోర్ట్లలో ఆరింటి విడుదల మంత్రులు, మిగిలిన నాలుగింటిని సీఎం స్వయంగా ప్రజల ముందుంచుతారు.
ఈ రిపోర్ట్లను జులై 18 లోగా పూర్తి చేయాలని సీఎం గడువు విధించారు. ఈ ప్రణాళికపై త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com