మటన్ వడ్డించే హామీ నెరవేర్చకపోవడంతో వివాహ వేడుకలో ఘర్షణ: 12 మందికి గాయాలు
బీహార్ రాష్ట్రం సహర్సా జిల్లాలో ఒక వివాహ వేడుకలో విందు భోజనం విషయంలో ఘర్షణ జరిగింది. మటన్ పెడతామని హామీ ఇచ్చి చికెన్ వడ్డించడంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు.
వధువు కుటుంబం వరుడి బంధువులకు మటన్ వడ్డిస్తామని ముందే చెప్పింది. అయితే వివాహ విందులో మటన్ స్థానంలో చికెన్ వడ్డించారు. ఇది చూసిన వరుడి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. మాటలు పెరిగి ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నాయి.
ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహర్సా పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఇరు వర్గాలపై అత్యాయత్నం, అల్లర్ల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com